Jhansi Koppishetti,ఝాన్సీ కొప్పిశెట్టి
ఈ పుస్తక పఠనం స్వీయ వ్యక్తిత్వాన్ని సంతరించుకోడానికి ప్రేరణ ,ఆత్మభిమానం ,ఆత్మగౌరవం ఆభరణాలుగా తమ మార్గాన తమ్ము ప్రయాణించే ఆడవాళ్ళకు ఉద్దీపన.మహిళల వ్యక్తిత్వాన్ని గుర్తించి మసలుకునే సంస్కారం సమాజంలో పాడుకోవాలన్న ఆకాంక్షకు సృజనాత్మక వ్యక్తీకరణ .సరళ సుందరమైన శైలి సంవిధానం రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి ప్రతిభకు తార్కాణం .మొదలెడితే చివరిదాకా తమ వెంట తీసుకెళ్లగలిగే వాక్య విన్యాసం ఆమె నవలాశిల్పంలోని వైశిష్ట్యం .