ప్రసిద్ధి చెందిన మహాభారత మహాగ్రంధం కాలక్రమంలో బహుళ జనాదరనవలన,వక్తల-కవుల ఊహాప్రతిభావల్ల బహుకల్పనలకు,చిలవలుపలవల పిట్టకథలు లోనై అసలు కథ తెలియని పరిస్థితి ఏర్పడింది.భారతంలో రెండు పక్షాలున్నట్లే లోకంలో కూడా ఉంటాయి.ఆధారమపక్షాన్ని సమర్థించే కుహనామేధావులు విజృభించి కువాఖ్యలతో,అధ్యయన రాహిత్యంతో వ్రాసిన రచనలు ,తీసిన చిత్రాలు,నాటకాలు కలివైపరీత్యం వాళ్ళ జనులలో చొచ్చుకుపోయాయి .ఈ నేపథ్యంలో మూల భారతాన్ని ప్రమాణంగా తీసుకొని,పద్దెనిమిది రోజులు చేసిన ప్రవచనానికి పుస్తరూపమిది .ఈ గ్రంధం అజ్ఞాన నిశీధికి ఓ ఉషోదయం ,ఇప్పడాక వ్యాసభారతం చదువలేదని చింతించే వారికి అద్భుత అవకాశంగా దొరికిన ఒక విజ్ఞాన రసగుళిక ఈ గ్రంధం .