Dondapati Krishna
మూఢనమ్మకాలకు చెంపపెట్టుగా రాసిన కథ ‘దిష్టి’. భర్త ఆధిపత్యాన్ని మౌనంగా భరించిన ఆమె, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి మౌనాన్ని వీడి ధైర్యంగా నిలబడటం ‘ఉరేసుకున్న మౌనం’ కథలో చూస్తాం. బీమామిత్ర ఏజెంటుగా పనిచేస్తూ, బాధితులకొచ్చే సొమ్ములో వాటా దండుకుంటూ, అమానుషంగా వ్యవహరించే మనిషి, ఒక హిజ్రా మరణంతో పరివర్తన చెందటం ‘రాతిగుండెలో నీళ్ళు’ కథలో చూపారు. కరోనా నేపథ్యంలో క్వారంటైన్ లో ఉన్న భర్తకు, కాన్పుకు ఆసుపత్రిలో ఉన్న భార్యకు మధ్య జరిగిన మానసిక సంఘర్షణకు అద్దం పట్టిన కథ ‘కొత్త స్వరం’. ఇవి మచ్చుకు కొన్నే. అన్నీ చదవదగినవే.
- వల్లూరు శివ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం
ప్రధాన కార్యదర్శి, గుంటూరు