కవులు బహుశా మనిషికి ప్రకృతికి,పుట్టుకకి మరణానికి,బాల్యానికి వార్ధక్యాన్ని,మనిషికి మనిషికి ,మనిషికి తనకి,మనిషికి అతీతానికి ,మనిషికి సమయానికి ,మనస్సుకి హృదయానికి మధ్య,సంబంధ బాంధవ్యాల లోతుల్ని ఎప్పటికప్పుడు శోధిస్తూనే ఉంటారేమో.అందుకే బహుశా అనాదిగా అసంఖ్యాకంగా కవిత్వం వస్తూనే ఉంది.రాసేవారు ఆగిపోయిన ,ప్రపంచవ్యాప్తంగా కవిత్వం కొనసాగుతేనే ఉంది,కొనసాగింపుకే ఆరంభం అంతము ఉంటుంది.అది జీవితం,ఆనందం,బాధ ఏదైనా కావచ్చు.మూగ భాషల ఈ స్పృహ కవిత్వమంతా పరుచుకునుంటుంది .