సొంత ఊరిలో ఉంటూ కథలు రాయడం వేరు సొంత ఊరికి దూరంగా ఉంటూ కథలు రాయడం వేరు.ఎప్పటి విషయాల్లో ఇప్పుడు పునశ్చరణ చేసుకుంటూ,కథకు తగిన పరిసరాలను,వ్యక్తులను,ఆ కథ ద్వారా చెప్పదలుచుకున్న సందేశాన్ని జోడిస్తూ,నవరసాలను కూడా అందులో రంగరించి,ఒక చక్కటి శిల్పంలా పోత పోయాలంతే,ప్రతి రచయితకు ప్రసవ వేదన తప్పదు.అందుకే ప్రతి కథ వెనుక కొంత పరిశోధన ఉంది,నేను నమ్మిన అభావాలను ఎవరిని నొప్పించకుండా చెప్పాలనే తప్పన ఉంది.గుంటూరు జిల్లా పల్లెటూరు యాసను కథల్లో వాడాల్సి వచ్చినప్పుడు,అనేక మార్లు ఆ వాక్యాలను ఎడిట్ చేసి మార్చిన కష్టం ఉంది,న కథలు మనసున్న ప్రతి ఒక్కరి గుండె తలుపు తట్టాలని ఒక మధురానుభూతిగా వారి జ్ఞాపకాల్లో నివ్వాలని,నేను భావించాను.ఈ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యానని భావిస్తున్నాను .